డెహ్రాడూన్, మే 3: చార్ధామ్ యాత్ర మంగళవారం ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలను తెరిచి ప్రత్యేక పూజలు చేశారు. 2019 తర్వాత ఎలాంటి కరోనా ఆంక్షలు లేకుండా భక్తులను అనుమతించడం ఇదే తొలిసారి. ఈ సారి యాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొనే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేదార్నాథ్ ఆలయ ద్వారాలను 6న, బద్రీనాథ్ ఆలయ గేట్లను 8న తెరుస్తారు.