Char Dham Yatra | చార్ధామ్ యాత్రకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. గత నెల 3న ప్రారంభమైన నాటి నుంచి ఈ నెల 11 వరకు 19 లక్షల మందికిపైగా యాత్రలో పాల్గొన్నారని బ్రదీనాథ్ – కేదార్నాథ్ ఆలయ కమిటీ ఆదివారం తెలిపింది. శనివారం సాయంత్రం వరకు ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రలో మొత్తం 19,04,253 పాల్గొన్నారని పేర్కొంది. మే 8 నుంచి జూన్ 11 సాయంత్రం వరకు 6,57,547 మంది యాత్రికులు బద్రీనాథ్ ధామ్కు చేరుకోగా, మే 6 నుంచి జూన్ 11 సాయంత్రం వరకు 6,33,548 మంది యాత్రికులు కేదార్నాథ్ ధామ్కు చేరుకున్నారు.
కాగా, మే 27 వరకు యాత్రలో పాల్గొన్న 91 మంది వివిధ అనారోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా.. ఉత్తరాఖండ్ ప్రభుత్వ మే 11న యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్కు భక్తుల సంఖ్యను వెయ్యి చొప్పున పెంచుతూ నిర్ణయం ప్రకటించింది. దీంతో ఒక రోజులో 16వేల మంది భక్తులు బద్రీనాథ్ను, 13వేల మంది కేదార్నాథ్ ధామ్లోని స్వామివారలను దర్శించుకునేందుకు అవకాశం ఇచ్చింది. అలాగే గంగోత్రిలో 8వేల మందికి, యముత్రిని సందర్శించేందుకు 5వేలమందికి అవకాశం కల్పించింది. గంగోత్రి, యమునోత్రిలోని ఆలయాలను మే 3న తెరిచిన విషయం తెలిసిందే. కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను అదే నెల 6, 8 తేదీల్లో తెరిచారు.