న్యూఢిల్లీ: భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్లో ‘సాఫ్ట్ ల్యాండింగ్’ వీడియో ఈఏడాది యూట్యూబ్లో అత్యధిక మంది వీక్షించిన వీడియోగా రికార్డ్ సృష్టించింది. ‘రౌండ్ 2 హెల్’ ఛానల్ నిర్వహిస్తున్న ‘మెన్ ఆన్ మిషన్’ రెండో స్థానంలో నిలిచింది. 2023 ఏడాదికి సంబంధించి ఇండియాలో అత్యధిక మంది వీక్షించిన టాప్-15 వీడియోల జాబితాను ‘యూట్యూబ్ ఇండియా’ బుధవారం విడుదల చేసింది. సాఫ్ట్ ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారానికి 85 లక్షలకుపైగా వీక్షణలు దక్కాయని తెలిపింది. టాప్-15 మోస్ట్ పాపులర్ వీడియోస్ జాబితాలో యుపీఎస్సీ-స్టాండప్ కామెడీ, డైలీ వ్లాగర్స్ పారెడీ ఉన్నాయి.