బెంగళూరు, ఆగస్టు 9: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 వ్యోమనౌక జాబిల్లికి మరింత చేరువైంది. కక్ష్య తగ్గింపు ప్రక్రియను విజయవంతంగా చేపట్టినట్టు ఇస్రో తెలిపింది. ‘జాబిల్లికి అత్యంత సమీపానికి చేరుకొన్నాం.
నేటి విన్యాసంతో కక్ష్యను 174 కిలోమీటర్లు x 1,437 కిలోమీటర్లకు తగ్గించాం’ అని ఇస్రో వెల్లడించింది. ఇంకో రెండు సార్లు కక్ష్య తగ్గింపు ప్రక్రియలను చేపట్టాల్సి ఉంటుందని తెలిపింది. అంతా సజావుగా సాగితే ఈ నెల 23న సాయంత్రం ల్యాండర్-రోవర్ జాబిల్లిపై ల్యాండ్ కానున్నాయి.