బెంగళూరు, జూలై 11: చంద్రుడిపై అధ్యయనం కోసం ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3యాత్రకు సన్నాహాలు మొదలయ్యాయి. ఏపీలోని శ్రీహరికోట నుంచి జూలై 14న అంతరిక్ష నౌకను మధ్యాహ్నం 2.35 గంటలకు పంపనున్నారు.
ఈ క్రమంలో దానికి మందుగా యాత్రకు సంబంధించి 24 గంటల లాంచ్ రిహార్సల్ను మంగళవారం ప్రారంభించారు. రాకెట్ ప్రయోగానికి సంబంధించిన సన్నాహకత, ప్రక్రియను లాంచింగ్ రిహార్సల్ 24 గంటల పాటు సిమ్యులేట్ చేస్తుందని భారత అంతరిక్ష సంస్థ మంగళవారం ట్వీట్ చేసింది.