ముంబై: జాబిల్లిపై చంద్రయాన్ అడుగుపెట్టడానికి ఇంకా కొద్ది గంటలు మాత్రమే ఉండటంతో దేశం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నది. చంద్రుడిపై విక్రమ్ విజయవంతంగా అడుగుపెట్టాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చిలలో పూజలు, ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ఆగ్రా, వారణాసిలలో పలువురు భక్తులు సంప్రదాయంగా హవనాన్ని నిర్వహించారు.
లక్నోలోని ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియాలో ముస్లింలు ప్రార్థనలు చేశారు. ముంబైలోని శివ మందిరంలో పెద్దయెత్తున హవనం నిర్వహించారు. చంద్రయాన్ విజయవంతం కావాలంటూ పలు దేవాలయాలలో భక్తులు అభిషేకాలు, పూజలు జరిపించారు.