న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: చంద్రుడి ఉపరితలంపై 250కి పైగా సెస్మిక్ సిగ్నళ్లను చంద్రయాన్-3 గుర్తించింది. దీంతో ఇప్పటివరకు ఎక్కువ సెస్మిక్ సిగ్నళ్లను గుర్తించిన మిషన్గా చంద్రయాన్-3 గుర్తింపు పొందింది. చంద్రయాన్-3లో భాగంగా విక్రమ్ ల్యాండర్ ద్వారా చంద్రుడిపైకి పంపించిన ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ(ఐఎల్ఎస్ఏ) చంద్రుడిపై సెస్మిక్ సిగ్నళ్లను గుర్తించింది. ఈ 250 సిగ్నళ్లలో 200 వరకు ప్రజ్ఞాన్ రోవర్ కదలికలకు సంబంధించినవి కాగా, 50 సిగ్నళ్లు మాత్రం భిన్నమైనవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి చంద్రుడి ఉపరితలంపై సంభవించిన ప్రకంపనలు అయి ఉంటాయని భావిస్తున్నారు. చంద్రుడి దక్షిణ ధృవం నుంచి సెస్మిక్ డాటాను సేకరించడం ఇదే తొలిసారి.
రాత్రి మేల్కొనేవాళ్లకు డయాబెటిస్ ముప్పు..
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: రాత్రి సమయంలో త్వరగా పడుకొని.. పొద్దునే లేచే వ్యక్తులతో పోల్చితే, రాత్రంతా మేల్కొనేవాళ్లు టైప్-2 డయాబెటిస్ బారినపడే ముప్పు 46 శాతం ఎక్కువ అని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. డయాబెటిస్ రావడానికి జీవన శైలి ఒక్కటే కారణం కాదని, అధిక బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్), పెద్ద పొట్ట, శరీరంలో అధిక కొవ్వులు.. ఇవన్నీ టైప్-2 డయాబెటిస్ను కలుగజేయడంలో 50శాతం పాత్ర వహిస్తాయని నెదర్లాండ్స్ పరిశోధకులు తేల్చారు. మూడు రకాలైన నిద్ర సమయాల్ని కలిగిన 5 వేల మందిపై నెదర్లాండ్స్ ‘లైడెన్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్’ సైంటిస్టులు పరిశోధన చేశా రు. నిద్రపోతున్న తీరుతో మన శరీరంలో జీవ గడియారం ప్రభావితం కాగానే, అది జీవ క్రియల్ని ఆటంక పరుస్తున్నదని, ఇది టైప్-2 డయాబెటిస్కు దారితీస్తున్నదని పరిశోధకుడు జిరోన్ వాన్ డెర్ వెల్డె చెప్పారు.