న్యూఢిల్లీ, జూలై 4: ఢిల్లీ విద్యుత్తు నియంత్రణ కమిషన్(డీఈఆర్సీ) చైర్పర్సన్ నియామకం విషయంలో ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కేంద్రం తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేసినా డీఈఆర్సీ చైర్పర్సన్గా జస్టిస్ ఉమేశ్ కుమార్ ప్రమాణ స్వీకారాన్ని సుప్రీంకోర్టు మంగళవారం వాయిదా వేసింది. కేంద్రం తాజా ఆర్డినెన్స్ను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి నియామకాల రాజ్యాంగ చెల్లుబాటును సమీక్షించాల్సి ఉందని పేర్కొంది. ఆర్డినెన్స్పైనా, డీఈఆర్సీ చైర్పర్సన్ నియామకంపైనా కేంద్రానికి, ఎల్జీకి నోటీసులు జారీ చేసింది. వివాదాస్పదం కాని రీతిలో వివాదాన్ని పరిష్కరించాల్సి ఉందని తెలిపింది.