లక్నో: బీఎండబ్ల్యూ కారు 230 కిలోమీటర్ల వేగంతో రోడ్డుపై దూసుకెళ్లింది. ఆ వేగంతో కంటైనర్తో ఢీకొట్టింది. అందులో ప్రయాణించిన నలుగురు మరణించారు. ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై ఈ ప్రమాదం జరిగింది. బీహార్లోని డెహ్రీకి చెందిన 35 ఏళ్ల డాక్టర్ ఆనంద్ ప్రకాష్, రోహతాస్లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ పని చేస్తున్నాడు. శుక్రవారం మరో ముగ్గురితో కలిసి సుల్తాన్పూర్ నుంచి ఢిల్లీకి బీఎండబ్ల్యూ కారులో వెళ్తున్నాడు. ఆనంద్ ప్రకాష్ ఆ కారును డ్రైవ్ చేస్తున్నాడు. కారు వేగం 300కు చేరుకోవాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. కారు స్పీడో మీటర్ను ఫేస్బుక్ లైవ్ స్ట్రీమ్ చేశారు.
కాగా, ఆ కారు 230 కిలోమీటర్ల వేగానికి చేరుకుంది. దీంతో డ్రైవ్ చేస్తున్న ఆనంద్.. ‘మనం నలుగురం చనిపోతాం’ అని అన్నాడు. అందులోని ఒకరు ‘స్లో డౌన్’ అని అరిచాడు. అయితే వేగం తగ్గించవద్దని, బ్రేకులు వేయవద్దని మరో వ్యక్తి చెప్పాడు. ఈజీగా తీసుకోవాలని కారులో ఉన్న మూడో వ్యక్తి అన్నాడు.
మరోవైపు కారు 230 కిలోమీటర్ల వేగంతో వెళ్తుండటంతో అంతా సీటు బెల్టులు పెట్టుకోవాలని డ్రైవ్ చేస్తున్న ఆనంద్ తెలిపాడు. ఖాళీ రోడ్డు కనిపించగానే 300 కిలోమీటర్ల వేగాన్ని చేరుతానని తన స్నేహితులకు భరోసా ఇచ్చారు. అంతలో ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ, ఆ కారు ఢీకొన్నాయి. వేగంగా ఢీకొట్టడంతో కారు ఇంజిన్తోపాటు అందులో ప్రయాణిస్తున్న వారంతా కొంత దూరం ఎగిరిపడి మరణించారు. వారి శరీరాలు మాంసం ముద్దలయ్యాయి.
కాగా, ఆనంద్ ప్రకాష్తోపాటు మిగతా ముగ్గురు మృతులు బీహార్లోని ఔరంగాబాద్కు చెందిన రియల్టర్ అఖిలేష్ సింగ్, ఇంజినీర్ దీపక్ కుమార్, వ్యాపారవేత్త ముఖేష్గా పోలీసులు గుర్తించారు. వీరంతా 30 ఏళ్ల వయస్కులని తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం తర్వాత పారిపోయిన కంటైనర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. అయితే ఆ కారు 230 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న లైవ్ స్ట్రీమ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
हादसे से ठीक पहले फेसबुक पर लाइव आकर दिखाई BMW की स्पीड.
(पार्ट-2) pic.twitter.com/PuzPRbgw1w
— UnSeen India (@USIndia_) October 15, 2022