న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అధికార ప్రాంతం పరిధిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్తో అంతర్జాతీయ సరిహద్దు నుంచి ఆయా రాష్ట్రాల్లోని 50 కిలోమీటర్ల పరిధి వరకు తనిఖీలు, అనుమానితుల అరెస్ట్, వస్తువులను స్వాధీనం చేసుకునే అధికారాన్ని కల్పించింది.
అయితే పాక్, బంగ్లాదేశ్తో సరిహద్దులు కలిగిన పంజాబ్, పశ్చిమ బెంగాల్, అస్సాంలో ఇప్పటి వరకు బీఎస్ఎఫ్కు అధికార ప్రాంత పరిధి 15 కిలోమీటర్లు మాత్రమే ఉండేంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా దీనిని 50 కిలోమీటర్లకు పొడిగించింది.
ఉగ్రవాదం, సరిహద్దు నేరాలకు వ్యతిరేకంగా ‘జీరో టాలరెన్స్’ను నిర్ధారించడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. దీంతో ఈ పరిధిలో తనిఖీలు, అరెస్ట్లు, స్వాధీనాలకు బీఎస్ఎఫ్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేదు.
కాగా, పంజాబ్ సీఎం చరంజిత్ సింగ్ చన్నీ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఫెడరలిజంపై దాడిగా ఆయన ఆరోపించారు. ఈ అహేతుక నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను డిమాండ్ చేశారు.