న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ టీకాల పంపిణీని మరింత విస్తృతం చేసేందుకు కేంద్ర మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘హర్ ఘర్ దస్తక్’ పేరిట ఇంటింటికీ కొవిడ్ టీకాల పంపిణీ చేపట్టనున్నది. బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం ‘హర్ ఘర్ దస్తక్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు బుధవారం తెలిపారు. ప్రధాని మోదీ మహమ్మారిని అరికట్టేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకున్నారన్నారు. 100కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయడంలో భారత్ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని ప్రపంచం ప్రశంసించిందన్నారు.
ప్రజలకు భద్రత కల్పించాలని నిర్ణయించుకున్న మోదీ ప్రభుత్వం.. ఇవాళ ‘హర్ ఘర్ దస్తక్’ క్యాంపెయిన్ను ప్రారంభించిందని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ, గ్లాస్గో పర్యటన నుంచి అనంతరం టీకా కవరేజీ తక్కువ ఉన్న జిల్లాలతో సమీక్ష నిర్వహించారు. ఇందులో కొవిడ్ మొదటి డోస్ 50శాతం కంటే తక్కువ, రెండో డోస్ తక్కువ కవరేజీ ఉన్న జిల్లాలపై సమీక్ష జరిపారు.
జార్ఖండ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయతో పాటు పలు రాష్ట్రాల్లోని 40కిపైగా జిల్లాల కలెక్టర్లతో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయాలని ప్రధాని కోరారు. ఈ సందర్భంగా ఆరోగ్యమంత్రి స్పందిస్తూ.. త్వరలోనే మెగా వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే నెల రోజుల పాటు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయాలని నిర్ణయించామన్నారు. మొదటి డోసుతో పాటు రెండో డోసు తీసుకోని వారికి టీకాలు వేయనున్నట్లు పేర్కొన్నారు.