న్యూఢిల్లీ, నవంబర్ 30: 97 తేజస్ తేలికపాటి ఎయిర్క్రాఫ్టులు, 156 తేలికపాటి ప్రచండ్ హెలికాప్టర్ల కొనుగోలుకు గురువారం కేంద్రం ప్రాథమిక ఆమోదం తెలిపింది. దీని ద్వారా త్రివిధ దళాల సామర్థ్యాన్ని పెంపొందించాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. మొత్తం కొనుగోళ్లలో రూ.2.23 లక్షల కోట్ల విలువైన 98 శాతం ఆర్డర్ను దేశీయ పరిశ్రమల నుంచే కొనుగోలు చేస్తామని వెల్లడించారు.
సుఖోయ్ ఎస్-30 ఫైటర్ ఫ్లీట్ను అప్గ్రేడ్ చేయాలన్న వైమానిక దళ ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) ఆమోదం తెలిపింది. టీ-90 ట్యాంకుల కోసం ఆటోమేటిక్ టార్గెట్ ట్రాకర్, డిజిటల్ బాలిస్టిక్ కంప్యూటర్, రెండు రకాల యాంటీ-టాంక్ ఆయుధాలను, మీడియం రేంజ్ యాంటీ-షిప్ మిస్సైళ్ల కొనుగోలుకు కూడా డీఏసీ ఆమోదం తెలిపింది.