బీఎస్పీ అధినేత్రి మాయావతి.. ఇక విశ్రాంతి తీసుకోవాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఎద్దేవా చేశారు. బాబాసాహెబ్ కలలను సాకారం చేయడానికి తమ పార్టీ శ్రమిస్తుందని, ఇక మాయావతి రెస్ట్ తీసుకోవాలని రాందాస్ అథవాలే చురకలంటించారు. బాబా సాహెబ్ కలలను సాకారం చేయడానికి తమ పార్టీ శ్రమిస్తుందని ఆయన పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా అంబేద్కర్ కలలను సాకారం చేయడానికే తమ పార్టీ ప్రాధాన్యమిస్తుందని, యూపీలో బీఎస్పీకి ఓ ప్రత్యామ్నాయ శక్తిగా తప్పకుండా ఉద్భవిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బిహార్ తర్వాత రాందాస్ ప్రస్తుతం యూపీపై దృష్టి సారించారని ఆయన పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. బీఎస్పీకి ఓ ప్రత్యామ్నాయంగా ఎదగడానికే ఆయన ప్రయత్నాలు కూడా చేస్తున్నారని ఆయన వర్గీయులు అంటున్నారు.