న్యూఢిల్లీ : జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి మరో అడుగు పడింది. తీవ్రవాద సంస్థ అయిన యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యూఎన్ఎల్ఎఫ్)తో ప్రభుత్వం శాంతి ఒప్పందాన్ని చేసుకుంది. ఇక నుంచి హింసను వీడనున్నట్టు యూఎన్ఎల్ఎఫ్ ప్రకటించిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బుధవారం ప్రకటించారు. మణిపూర్ లోయ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సాయుధ పురాతన గ్రూప్ అయిన యూఎన్ఎల్ఎఫ్తో శాంతి ఒప్పందం చరిత్రలో మైలురాయి అని, ప్రజాస్వామ్య పథంలోకి వారిని ఆహ్వానిస్తున్నానని, శాంతి మార్గంలో వారి పయనం విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నట్టు అమిత్ షా తెలిపారు.