Ban on Dog Breeds | న్యూఢిల్లీ: పెంపుడు కుక్కల దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పిట్బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్డాగ్, రాట్వీలర్, మస్టిఫ్స్ వంటి 23 జాతుల కుక్కల సంతానోత్పత్తి, అమ్మకాలను నిషేధించాలని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశించింది.
వీటిని ప్రజలు పెంచుకోవడాన్ని కూడా నిషేధించింది. ఇప్పటికే ప్రజల వద్ద ఉన్న ఈ పెంపుడు కుక్కలకు సంతానోత్పత్తి జరగకుండా స్టెరిలైజ్ చేయాలని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ ఈ నెల 12న లేఖలు రాసింది.