న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రం తవాంగ్ సెక్టార్లో ఈ నెల 9న భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్.. ఇవాళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు వివరణ ఇవ్వనున్నారు. సీడీఎస్తోపాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ చీఫ్లు కూడా రాజ్నాథ్తో భేటీ కానున్నారు.
తవాంగ్ సెక్టార్లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల గురించి భద్రతా బలగాలు ఇప్పటికే సీడీఎస్కు పూర్తి వివరాలు తెలియజేశాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ చీఫ్లు కూడా తాజా ఘర్షణలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ రాజ్నాథ్ సింగ్ను కలిసి వారు ఆయనకు పూర్తి వివరాలు తెలియజేయనున్నారు.