Bipin rawat | హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం బిపిన్ రావత్ పార్థివ దేహాన్ని సైనిక విమానంలో ఢిల్లీకి తరలించనున్నారు. శుక్రవారం ఆయన నివాసంలో భౌతికకాయాన్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సందర్శనకు ఉంచనున్నారు. అనంతరం బ్రార్ స్క్వైర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.