ఔరంగాబాద్ : విలువైన వస్తువుల జాబితాలో టమాటా చేరిపోయింది. ఇటీవలి కాలంలో వరుసగా టమాటాల చోరీ ఘటనలు చోటుచేసుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా షాపూర్ బంజర్కు చెందిన శరద్ రావతే అనే ఓ రైతు తన టమాటా పొలం వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకొన్నాడు. దొంగల బెడద ఎక్కువైందని ఆందోళన వ్యక్తం చేశారు.