న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించే 10, 12 తరగతుల ఫైనల్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతాయి. పదో తరగతి పరీక్షలు మార్చి 18తోనూ, పన్నెండో తరగతి పరీక్షలు ఏప్రిల్ 4తోనూ ముగుస్తాయి. ఈ మేరకు సీబీఎస్ఈ బుధవారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. రెండు సబ్జెక్టుల పరీక్షల తేదీల మధ్య తగినంత వ్యవధిని ఇచ్చినట్లు తెలిపింది. విద్యార్థి ఎంచుకున్న రెండు సబ్జెక్టుల పరీక్షలు ఒకే రోజు రాయవలసిన అవసరం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించింది. 86 రోజుల ముందు ఈ షెడ్యూలును ప్రకటించడం ఇదే తొలిసారి.