న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రాసే డయాబెటిక్ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి తమ వెంట పండ్లు, నీళ్ల బాటిల్, గ్లూకోమీటర్ తీసుకెళ్లవచ్చు. ఈ మేరకు బోర్డు వెసులుబాటు కల్పించింది. త్వరలో సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో బోర్డు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
వీటి ప్రకారం డయాబెటిక్ విద్యార్థులు తొలుత పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి. అది కూడా పాఠశాల ద్వారా దరఖాస్తు చేసుకొని సంబంధిత పత్రాలను సమర్పించాలి. తర్వాత పరీక్షలు ప్రారంభానికి ఒకరోజు ముందు పరీక్ష కేంద్రానికి వెళ్లి డయాబెటిక్ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. దీంతో అధికారులు కూడా ఏర్పాట్లు చేసుకుంటారు.