CBSE 10th Results | సీబీఎస్ఈ పదో తరగతి ఫస్ట్ టర్మ్ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. శుక్రవారం ఫలితాలు వెలువడినా.. ఆయా మార్కుల షీట్లు మాత్రం విద్యార్థులకు శనివారం రాత్రి వరకు అందుబాటులోకి రాకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పదో తరగతి ఫస్ట్ టర్మ్ పరీక్షా ఫలితాలను సంబంధిత స్కూళ్లకు సీబీఎస్ఈ షేర్ చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం పదో తరగతి ఫస్ట్ టర్మ్ పరీక్షా ఫలితాలను పంపుతున్నామని, కోడ్ ఆధారంగా తెలిపామని పేర్కొంది.
ఫస్ట్ టర్మ్ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయని తెలియగానే పదో తరగతి విద్యార్థులు అధికారిక వెబ్సైట్ cbseresults.nic.in మీద పడ్డారు. స్కూల్ కోడ్తోనూ, వ్యక్తిగత రూల్ నంబర్లతో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని సీబీఎస్ఈ.. results.gov.in,digilocker.gov.in అనే వెబ్సైట్లలోనూ అప్లోడ్ చేసింది. గత నవంబర్-డిసెంబర్ నెలల్లో జరిగిన 10వ తరగతి, 12వ తరగతి ఫస్ట్ టర్మ్ పరీక్షలకు 36 లక్షల మందికి పైగా హాజరయ్యారు.
టర్మ్ 2 పరీక్షలు వచ్చే నెల 26 నుంచి ప్రారంభం అవుతాయి. ఈ పరీక్షల్లో విద్యార్థులు అబ్జెక్టివ్, సబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఫస్ట్ టర్మ్ ఫలితాల మార్క్ షీట్లు జారీ చేయరు. టర్మ్ 2 ఫలితాలు వెలువడ్డాకే విద్యార్థుల మార్క్షీట్లు అప్లోడ్ చేస్తారు. కానీ ఇప్పటికైతే విద్యార్థుల మార్కుల వివరాలు అధికారిక వెబ్సైట్లో కనిపించడం లేదు. చాలా మంది విద్యార్థులు తమ మార్క్లు రావడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు.