కోల్కతా, అక్టోబర్ 8: పశ్చిమ బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీం, తృణమూల్ ఎమ్మెల్యే మదన్ మిత్రా నివాసాలపై సీబీఐ ఆదివారం దాడులు చేపట్టింది. స్థానిక సంస్థల్లో ఉద్యోగ నియామకాల్లో అక్రమాల ఆరోపణలపై సోదాలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.
తృణమూల్ నాయకులు సుదామ రాయ్, అంగుశ్మాన్ రాయ్, అషిం ఘోష్ ఇండ్లు, ఇతర స్థావరాల్లోనూ సోదాలు జరిపినట్టు సీబీఐ ప్రకటించింది.