న్యూఢిల్లీ, జనవరి 13: ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ స్కామ్లో రైల్వే శాఖ మాజీ మం త్రి, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ను విచారించేందుకు సీబీఐకి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. గత ఏడాది అక్టోబరు 7న ఈ కేసులో సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవితో పాటు మరో 14 మందిపై ఆరోపణలు చేసింది.
రైల్వేలో ఉద్యోగం ఇచ్చేందుకు లంచంగా భూములు తీసుకున్నారనేది వీరిపై ప్రధాన ఆరోపణ. లంచంగా తీసుకున్న భూములను వారి పేర్ల మీద లేదంటే వారి దగ్గరి బంధువుల పేర్ల మీదకు మార్చుకున్నారని సీబీఐ చెబుతున్నది.