CBDT | ఇటీవల ఒడిశా, జార్ఖండ్, బెంగాల్లో ఆదాయపు పన్నుశాఖ దాడులు నిర్వహించి రూ.351కోట్లకుపైగా లెక్కల్లో చూపని సొత్తు, రూ.2.80కోట్ల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) గురువారం ప్రకటన చేసింది. అయితే, సీజ్ చేసిన సొత్తు ఎవరిదో మాత్రం పేర్కొనలేదు. కేవలం జార్ఖండ్లోని రాంచీకి చెందిన ఓ కుటుంబ సంస్థలో దాడులు నిర్వహించామని, ఆయన రాజకీయంగా సంబంధాలు ఉన్నట్లుగా బోర్డు ప్రకటనలో పేర్కొంది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహు కుటుంబానికి చెందిన బౌద్ డిస్టిలరీ గ్రూప్కుపై ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లోని 30 ప్రాంతాల్లో డిసెంబర్ 6న ఆదాయపు పన్నుశాఖ సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాథమిక విశ్లేషణలో దేశంలోని మద్యం అమ్మకాల రికార్డులు, బహిర్గతం చేయని నగదు రసీదులు, ఖాతాలో లేని నగదు లావాదేవీల రికార్డులు వెల్లడైనట్లు సీబీడీటీ పేర్కొంది.