Jammu Kashmir | శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని ఫూంచ్ జిల్లాలో గురువారం మధ్యామ్నం ఘోర ప్రమాదం సంభవించింది. ఫూంచ్ – జమ్మూ హైవేపై వెళ్తున్న ఆర్మీ ట్రక్కులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు సైనికులు సజీవదహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, సైనికులు ఘటనాస్థలికి చేరుకున్నాయి. మంటలధాటికి ట్రక్కు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.