న్యూఢిల్లీ: అక్రమ మైనింగ్ (Illegal Mining) వ్యవహారంలో పంజాబ్, హర్యానాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు నిర్వహిస్తున్నది. రెండు రాష్ట్రాల్లో 20కిపైగా ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హర్యానాలోని ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్ (Dilbag Singh) నివాసంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్రమ విదేశీ ఆయుధాలు, 300కుపైగా కార్ట్రిజ్లు, 100కుపైగా విదేశీ మద్యం బాటిళ్లు, రూ.5 కోట్లు, సుమారు 5 కేజీల బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దిల్బాగ్తోపాటు అతని అనుచరుల ఇండ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సురీందర్ పన్వర్ ఇంట్లో కూడా సోదాలు చేశారు.