ముంబై: మాజీ మంత్రి, శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత ఆదిత్య థాక్రేపై (Aaditya Thackeray) మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదుచేశారు. ముంబైలోని (Mumbai) లోయర్ పరేల్లో డెలిస్లే బ్రిడ్జి (Delisle Bridge) రెండో క్యారేజీని గురువారం రాత్రి ఆదిత్య థాక్రే ప్రారంభించారు. దీంతో అనుమతి లేకుండా బ్రిడ్జిని ప్రారంభించారని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఆయనపై ఫిర్యాదు చేసింది. థాక్రేతోపాటు సునీల్ షిండే, సచిన్ అహిర్పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్చేశారు.
దక్షిణ ముంబై, లోయర్ పరేల్ను కలుపుతూ డెలిస్లే బ్రిడ్జ్ను బీఎంసీ నిర్మించింది. ఇందులో కొంత భాగాన్ని గత జూన్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. రెండో విడుతలో కర్రీ రోడ్, లోయర్ పరేల్ను కలుపుతూ నిర్మించిన బ్రిడ్జిని సెప్టెంబర్లో ప్రారంభించారు.