Car accident : అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన కారు ప్రమాదంలో భారత సంతతికి చెందిన 21 ఏళ్ల మహిళ అర్షియా జోషి దుర్మరణం పాలయ్యారు. ఘటనపై న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఈ మేరకు తన అధికార ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది.
‘కారు ప్రమాదంలో అర్షియా జోషి మరణం బాధాకరం. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అర్షియా భౌతిక కాయాన్ని భారత్కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సాధ్యమైనంత తొందరగా అర్షియా బాడీని భారత్కు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్లో పేర్కొంది.