చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్సింగ్ ( Amarinder Singh ) ఆ రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీకి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ముఖ్యమంత్రికి సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ను భద్రంగా కాపాడుకునే శక్తి ఉందని తాను భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. చరణ్జీత్సింగ్ చన్నీ పంజాబ్ సరిహద్దుల్లో రోజురోజుకు పెరుగుతున్న భద్రతాపరమైన భయాల నుంచి ప్రజలను రక్షిస్తారని ఆశిస్తున్నానని అమరీందర్సింగ్ ట్వీట్ చేశారు.
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విభేదాలు, తదనంతర పరిణామాల నేపథ్యంలో అమరీందర్ సింగ్ శనివారం ఉదయం సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సుదీర్ఘ తర్జనభర్జనల అనంతరం కాంగ్రెస్ హైకమాండ్ పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్జీత్సింగ్ చన్నీని ఎంపికచేసింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ప్రకటన చేసింది.