Captain Amarinder Singh | పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్ తాను కొత్తగా ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని వార్తలొస్తున్నాయి. గతేడాది కాంగ్రెస్ పార్టీ ఆయనను పంజాబ్ సీఎంగా తప్పించి చరణ్ సింగ్ చన్నీని నియమించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరిట కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. గత ఫిబ్రవరిలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేశారు. ప్రస్తుతం అమరిందర్సింగ్ విదేశాల్లో ఉన్నారు.
లండన్లో అమరిందర్సింగ్ శస్త్ర చికిత్స పూర్తి చేసుకున్నారు. వచ్చేవారం స్వదేశానికి రానున్నారు. భారత్కు రాగానే బీజేపీలో పంజాబ్ లోక్ కాంగ్రెస్ను విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయనున్నారని విశ్వసనీయ వర్గాల కథనం. ఈ విషయమై ప్రధాని నరేంద్రమోదీతో కెప్టెన్ అమరిందర్ సింగ్తో సంప్రదింపులు చేశారని సమాచారం.
సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో అమరిందర్ సింగ్ పని చేశారు. బీజేపీ కనుసన్నల్లో అమరిందర్ పని చేయడం వల్లే పదవి నుంచి తొలగించామని కాంగ్రెస్ తెలిపింది. దీంతో తీవ్ర మనఃస్థాపానికి గురైన కెప్టెన్.. కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగి సొంత కుంపటి ఏర్పాటు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి 37 స్థానాలో పోటీ చేశారు. పాటియాల నుంచి పోటీ చేసిన కెప్టెన్ అమరిందర్ సింగ్కు డిపాజిట్ కూడా రాలేదు. ఒక్క స్థానంలో కూడా కెప్టెన్ పార్టీ అభ్యర్థులు గెలుపొందలేదు.