న్యూఢిల్లీ, మే 25: ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్లో కంబాట్ ఏవియేటర్గా (యుద్ధ విమాన పైలట్) నియమితులైన తొలి మహిళా అధికారిగా కెప్టెన్ అభిలాష బరాక్ చరిత్ర సృష్టించారు. ఈ మేరకు బుధవారం భారత ఆర్మీ ట్విట్టర్లో పేర్కొన్నది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకొన్న ఆమెను కొవెటెడ్ వింగ్స్ అవార్డుతో సత్కరించినట్టు వెల్లడించింది. ఆమె ఘనత భారత ఆర్మీ ఏవియేషన్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని పేర్కొన్నది. హర్యానాకు చెందిన అభిలాష.. 2018లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కార్ప్స్లో చేరారు.