ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కేంద్ర హోంమంత్రి అమిత్షాపై తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీ వేదికగా జరిగిన మతపరమైన అల్లర్లను ఆపడంలో అమిత్షా విఫలమయ్యారని విమర్శించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని జహంగీర్ లో అల్లర్లతో అట్టుడికిందని గుర్తు చేశారు. కొల్హాపూర్లో జరిగిన బహిరంగ సభలో పవార్ ప్రసంగించారు.
సీఎం కేజ్రీవాల్ వాటిని నియంత్రించేవారని, అయితే… అక్కడి పోలీసులు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటారని, ఆ శాఖను అమిత్షా చూస్తున్నారని పేర్కొన్నారు. జహంగీర్పూర్లో హింస జరుగుతున్నా, కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆపలేకపోయారని, ఆయన ఫెయిల్ అయ్యారని పవార్ మండిపడ్డారు.
ఢిల్లీలో ఏ చిన్న సంఘటన జరిగినా, ప్రపంచమంతా తెలిసిపోతుందన్నారు. దీంతో ఢిల్లీలో అశాంతి నెలకొందని తప్పుడు సంకేతాలు వెళ్లే ఛాన్స్ ఉందన్నారు. బీజేపీ కేంద్రంలో వున్నా, ఢిల్లీని హ్యాండిల్ చేయలేకపోతున్నారని పవార్ ఎద్దేవా చేశారు.
ఓ అంతర్జాతీయ నేత గుజరాత్లో పర్యటించడం ఎంతో ఆనందం వేసిందని, అయితే… డోనాల్డ్ ట్రంప్ మొదలు, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వరకూ అందరు నేతలనూ కేవలం గుజరాత్కే ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.