న్యూఢిల్లీ: నిందితులు కోరిన భాషలోనే చార్జ్షీట్ను దాఖలు చేయాలని దర్యాప్తు సంస్థల్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. వ్యాపం కుంభకోణంలో ఇద్దరు నిందితులపై సీఆర్పీసీ సెక్షన్-173 కింద సీబీఐ ఇంగ్లీష్ భాషలో చార్జ్షీట్ను దాఖలు చేయగా, దీనిని హిందీ భాషలో సమర్పించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. ‘దర్యాప్తు సంస్థలు, పోలీసులు అభియోగాల్ని ఏ భాషలో నమోదు చేయాలన్నది సెక్షన్-173 సీఆర్పీసీలో నిర్దిష్టంగా పేర్కొనలేదు. చార్జ్షీట్లో ఆరోపణల్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత నిందితుడికే ఉంటుంది’ అని సుప్రీం తేల్చిచెప్పింది.