నూఢిల్లీ, జూలై 3: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత దౌత్యవేత్తలు కారణమంటూ కెనడాలో పోస్టర్లు వెలిశాయి. కిల్లింగ్ ఇండియా పేరిట టొరంటోలో వెలిసిన పోస్టర్లలో ఖలిస్థానీ ఉగ్రవాదిని దౌత్యవేత్తలు సంజయ్కుమార్ వర్మ, అపూర్వ శ్రీవాత్సవ హత్య చేశారంటూ పేర్కొన్నారు.
జూలై 8న ఖలిస్థాన్ ఫ్రీడం ర్యాలీని నిర్వహిస్తున్నట్టు అందులో ఉంది. టొరంటోలోని గ్రేట్ పంజాబ్ బిజినెస్ సెంటర్ నుంచి ప్రారంభమై టొరంటోలోని భారత కాన్సుల్ కార్యాలయం వద్ద ర్యాలీ ముగుస్తుందని అందులో తెలిపారు. దీనిపై భారత అధికారులు స్పందించలేదు.