న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని(Parliament Building) మే 28వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆ రోజున హిందుత్వ ఐడియాలజీ నేత వీడీ సావర్కర్ జయంతి. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవన్కు సావర్కర్ సదన్ అని పేరు పెట్టాలని మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ ఆరోపించారు. ఆయన తన ట్విట్టర్లో స్పందిస్తూ పార్లమెంట్ భవనాన్ని సావర్కర్ సదన్ అని పిలువాలని, ఇక సెంట్రల్ హాల్ని మాఫీ కక్షా అని పిలువాలని తుషార్ గాంధీ ట్వీట్ చేశారు. మాఫీ అంటే క్షమించమని అడగటం. అండన్మాన్ జైలులో ఉన్న సావర్కర్ .. క్షమాపణలు కోరుతూ బ్రిటీషర్లకు లేఖ రాసినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
The PM will inaugurate the new Parliament building on 28th May, birth anniversary of V. D. Savarkar. He should name the building ‘Savarkar Sadan’ and the Central Hall as ‘Maafi Kaksh’.
— Tushar बेदखल (@TusharG) May 19, 2023
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జయరాం రమేశ్ కూడా కొత్త పార్లమెంట్ భవనంపై విమర్శలు చేశారు. జాతి నిర్మాణానికి పాల్పడిన తల్లులు, తండ్రులను అవమానిస్తున్నారని అన్నారు. గాంధీ, నెహ్రా, పటేల్, బోస్ లాంటి నేతల్ని విస్మరించినట్లు ఆయన ఆరోపించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను కూడా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.
A complete insult to all our Founding Fathers and Mothers. A total rejection of Gandhi, Nehru, Patel, Bose, et al. A blatant repudiation of Dr. Ambedkar. https://t.co/bkQJBiMpbt
— Jairam Ramesh (@Jairam_Ramesh) May 19, 2023