అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ న మ్మించి.. ఓ యువకుడికి రూ. 2.47 లక్షలు టోకరా వేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ యువకుడు ఉద్యోగం కోసం జాబ్ పోర్టల్లో రెస్యూమ్ అప్లోడ్ చే శాడు. డాటాను సేకరించిన సైబర్నేరగాళ్లు.. ఆ యువకుడికి ఫోన్ చేసి మీకు అమెరికాలో ఉ ద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించారు. అయితే ప్రాసెసింగ్, రిజిస్ట్రేషన్ ఫీజులంటూ మొదట రూ. 10 వేలు వసూలు చేసి.. ఆ తరువాత సెక్యూరిటీ డిపాజిట్, కొవిడ్ టెస్ట్, వీసా ప్రాసెసింగ్ అంటూ దఫ దఫాలుగా రూ. 2.47 లక్ష లు వసూలు చేశారు. ఇంకా డబ్బు అడుగుతుండటంతో మోసపోతున్నానని గ్రహించిన బాధితుడు శుక్రవారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో ఘటనలో బేగంబజార్కు చెందిన ఓ కిరాణా వ్యాపారి ఆన్లైన్లో ముంబైలో ఉండే ఒక దుకాణదారుడికి రూ. 2 లక్షల సామగ్రి పంపించాలంటూ ఆర్డర్ చేశాడు. డబ్బులు చెల్లించిన తరువాత అవతలి వ్యక్తి సెల్ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయానని గు ర్తించి సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.