కోల్కతా: పౌరసత్వ సవరణ చట్టాన్ని లోక్సభ ఎన్నికల లోపే అమలు చేయనున్నట్లు సీనియర్ బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్( Shivraj Singh Chouhan) తెలిపారు. సీఏఏ ద్వారా పౌరసత్వాన్ని ఇవ్వనున్నామని, విపక్షాలు చెప్పినట్లు రద్దు చేయడం లేదని ఆయన అన్నారు. లోక్సభ ఎన్నికల లోపే సీఏఏను అమలు చేస్తామని విశ్వాసంతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. మతపరమైన వేధింపులు తట్టుకోలేక పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన వాళ్లకు పౌరసత్వాన్ని ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సీఏఏకు చెందిన రూల్స్ను దాన్ని అమలు చేయడానికి ముందే ప్రకటించనున్నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. బెంగాల్లో పర్యటించారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెంగాల్లో కమీషన్, కరప్షన్ పెరిగిందని ఆరోపించారు. టీఎంసీ పాలన పట్ల ప్రజలు విసుగెత్తినట్లు పేర్కొన్నార.ఈసారి బెంగాల్లో 35 లోక్సభ సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.