న్యూఢిల్లీ: సీఏఏపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(CM Kejriwal) కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో జరిగిన వలసల కన్నా ఇప్పుడే ఎక్కువ వలసలు ఉంటాయన్నారు. దేశంలో శాంతిభద్రతలు లోపిస్తాయన్నారు. దీని వల్ల దోపిడీలు, దొంగతనాలు, రేప్లు జరుగుతాయన్నారు. పాక్, బంగ్లా, ఆఫ్ఘన్ దేశాలకు చెందిన మైనార్టీలకు పౌరసత్వం కల్పిస్తామని సీఏఏలో ఉందని, ఇది పేద దేశమని, మనం తలుపులు తెరిస్తే, అప్పుడు వాళ్లంతా ఎక్కడ సెటిల్ అవుతారని కేజ్రీ ప్రశ్నించారు. అందుకే స్వాతంత్య్రం నాటి రోజుల కన్నా ఇప్పుడు ఎక్కువగా మైగ్రేషన్ ఉంటుందన్నారు. గడిచిన 75 ఏళ్లలో ఢిల్లీలో 63 ఫ్లైఓవర్లు నిర్మించారని, కానీ గత పదేళ్ల ఆప్ పాలనలో 31 ఫ్లైఓవర్లు నిర్మించామని ఆయన తెలిపారు.