ICAI CA | న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సీఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పరీక్షలను రీ షెడ్యూల్ చేసింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం సీఏ ఇంటర్, గ్రూప్1 పరీక్ష మే 3, 5, 9 తేదీల్లో, గూప్ర్ 2 పరీక్ష మే 11, 15, 17 తేదీల్లో నిర్వహించనున్నారు. సీఏ ఫైనల్, గ్రూప్ 1 పరీక్షను మే 2, 4, 8 తేదీల్లో, గ్రూప్ 2 పరీక్షను మే 10, 14, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. తాజా షెడ్యూల్లో ఎలాంటి మార్పు ఉండబోదని ఐసీఏఐ స్పష్టం చేసింది. మెంబర్స్ ఎగ్జామినేషన్.. ఇంటర్నేషన్ ట్యాక్సేషన్ – అసెస్మెంట్ పరీక్షను మే 14, 16 తేదీల్లో నిర్వహిస్తామని వెల్లడించింది. అభ్యర్థులు ఇతర వివరాల కోసం ఎప్పటికప్పుడు www.icai.org అనే వెబ్సైట్ను చెక్ చేసుకోవాలని సూచించింది.