న్యూఢిల్లీ: అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల సూపర్టెక్ ట్విన్ టవర్స్ను మే 22వ తేదీలోగా కూల్చేస్తామని ఇవాళ నోయిడా అధికారులు సుప్రీంకోర్టుకు తెలిపారు. నోయిడాలోని ఎమరాల్డ్ కోర్ట్లో అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల బిల్డింగ్లను కూల్చివేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్ కంపెనీ సూపర్టెక్.. నోయిడాలో రెండు 40 అంతస్తుల నిర్మాణాలను చేపట్టింది. అయితే నోయిడా అధికారులు, బిల్డర్లు కుమ్మక్కై ఆ బిల్డింగ్లను నిర్మించినట్లు సుప్రీంకోర్టు గత తీర్పులో చెప్పింది. నోయిడాలోని ఎమరాల్డ్ కోర్ట్లో సూపర్టెక్ కంపెనీ ఆ బిల్డింగ్లను నిర్మించింది. ట్విన్ టవర్స్లో వెయ్యి ఫ్లాట్లు ఉన్నాయి. రూల్స్ను అతిక్రమించి ఆ ట్విన్ టవర్స్ను నిర్మించినట్లు సుప్రీం పేర్కొన్నది. అయితే స్వంత ఖర్చుతో మూడు నెలల్లోగా ఆ రెండు బిల్డింగ్లను సూపర్టెక్ కంపెనీయే నేలమట్టం చేయాలని సుప్రీం తన తీర్పులో ఆదేశించింది.