భోపాల్: మధ్యప్రదేశ్లోని గుణాలో బుధవారం రాత్రి డంపర్ లారీని ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. మంటలు చెలరేగడంతో (Bus Fire) 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 18 మంది గాయపడ్డారు. అయితే బస్సు యజమాని బీజేపీ నాయకుడు ధర్మేంద్ర సికార్వార్గా గుర్తించారు. అలాగే బస్సు ఫిట్నెస్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల గడువు ముగిసినట్లు నిర్ధారించారు. 2021 నుంచి రోడ్డు పన్ను కూడా చెల్లించని విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్తోపాటు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.
కాగా, బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ కొత్త సీఎం మోహన్ యాదవ్ ఈ బస్సు ప్రమాదంపై స్పందించారు. హృదయ విదారక సంఘటనగా అభివర్ణించారు. బస్సు ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, గుణా సందర్శిస్తానని తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం చెల్లిస్తామని వెల్లడించారు.
गुना बस हादसे में 13 लोग ज़िंदा जल गये, बीजेपी नेता की बस थी फिटनेस 2015 में खत्म, इंश्योरेंस 2009, रोड टैक्स 2021 … फिर भी बस दौड़ रही थी pic.twitter.com/HW2C3gNqDc
— Anurag Dwary (@Anurag_Dwary) December 28, 2023