మథుర: ఢిల్లీలో ప్రైవేటు స్లీపర్ బస్సు(Delhi Sleeper Bus)లో సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గ్రేటర్ నోయిడాకు ప్రయాణిస్తున్న 16 ఏళ్ల బాలికపై.. స్లీపర్ బస్సు డ్రైవర్, కండెక్టర్ గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. ఈ ఘటన ఆగస్టు 4వ తేదీన జరిగింది. అయితే ఆ బస్సును ఏప్రిల్లో ఫిరోజాబాద్లో రిజిస్టర్ చేశారు. గడిచిన మూడు నెలల్లో ఆ బస్సు 12 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడింది. ఆ అంశంలో 12 సార్లు బస్సుకు జరిమానా విధించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంట్లో యమునా ఎక్స్ప్రెస్వే మీదే 9 సార్లు ఉల్లంఘన జరిగినట్లు తెలిపారు. దాదాపు అన్ని సార్లు ఓవర్ స్పీడింగ్ కింద ఫైన్ వేశారు.
నోయిడాలోని సెక్టార్ 63కు వెళ్లేందుకు 16 ఏళ్ల బాలిక UP 83 ET 3789 బస్సు ఎక్కింది. అయితే ఆ బస్సులో అత్యాచారానికి పాల్పడిన తర్వాత ఆమెను ఢిల్లీలోని కశ్మీర్ గేటు వద్ద నిందితులు వదిలేశారు. కశ్మీర్ గేట్ పోలీసు స్టేషన్లో ఆ బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బస్సును సీజ్ చేశారు. డ్రైవర్ కుల్దీప్, కండెక్టర్ సందీప్ను అరెస్టు చేశారు. ఆ ఇద్దరూ కాన్పూర్ వాసులే.
స్లీపర్ బస్సుకు మథురలోనే 8 చలాన్లు జారీ అయినట్లు ఏఎస్పీ సురేశ్ చంద్ర రావత్ తెలిపారు. ఆ బస్సు మీద మొత్తం 63వేల ఫైర్ ఉన్నదని పోలీసులు వెల్లడించారు. వరుసగా ఆరు రోజు ఓవర్ స్పీడ్ వల్ల 24 వేల ఫైన్ పడింది. ఓ సారి అక్రమ పార్కింగ్, హైవేపై ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం లాంటి ఫైన్ కూడా ఉన్నది. రిఫ్లెక్టర్ టేప్తో పాటు ఇతర అంశాల్లోనూ ఆ బస్సుకు ఫైన్ పడింది.