నాగపూర్, మార్చి 12: ప్రాణాలకు తెగించి ఒక బస్ డ్రైవర్ చూపిన సాహసం 35 మంది ప్రయాణికులను రక్షించింది. దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో గాయపడినా.. రక్తమోడుతూ అలాగే 30 కిలోమీటర్లు బస్ నడిపి పోలీస్ స్టేషన్కు తీసుకుపోయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. షెగావ్ నుంచి నాగపూర్కు 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్ను దోపిడీ దొంగలు కారులో వెంబడించారు. నాగపూర్ హైవేపై షెగావ్ వద్ద డ్రైవర్పై కాల్పులు జరిపారు.
దాంతో ఒక బుల్లెట్ డ్రైవర్ చేతికి తగిలింది. అయినప్పటికీ ప్రయాణికులను ఎలాగైనా రక్షించాలనే ఉద్దేశంతోడ్రైవర్ ఖోమ్దేవ్ కవాడె బస్ కంట్రోల్ తప్పకుండా 30 కిలోమీటర్లు పాటు నడిపి దగ్గరలోని పోలీస్స్టేషన్కు ప్రయాణికులను చేర్చాడు. డ్రైవర్ చూపిన సాహసాన్ని పోలీసులు, ప్రయాణికులు అభినందించారు.