Prayagraj : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ జిల్లాలో విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. సైదాబాద్ ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన ఈ సంఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. పలువురికి గాయాలు అయ్యాయి. ప్రమాదం సమయంలో బస్సులో 75 మంది విద్యార్థులు ఉన్నారు. బైక్ మీద వెళ్తున్న ఇద్దరినీ తప్పించే క్రమంలో డ్రైవర్ బస్సు మీద పట్టు కోల్పోయాడు. దాంతో బస్సు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిని విద్యార్థులను సమీపంలోని ఎస్ఆర్ఎన్ ఆస్పత్రికి తరలించారు. బైక్ మీద ఉన్నవాళ్లు కూడా గాయపడ్డారు.
కాంతి దేవి జనతా విద్యాలయానికి చెందిన 75 మంది విద్యార్థులు జౌన్పూర్ నుంచి ప్రయాగ్రాజ్కు బస్సులో బయలు దేరారు. హనిడా పోలీస్ స్టేషన్ పరిధిలోని సైదాబాద్ ప్రాంతంలో వీళ్లు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా కొట్టింది. విషయం తెలిసిన వెంటనే డీసీపీ గంగంన్గర్ అభిషేక్ అగర్వాల్ ప్రమాదస్థలికి చేరుకున్నారు. 20 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డట్టు పోలీసులు తెలిపారు.