న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్పై తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు శతృఘ్న సిన్హా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. బడ్జెట్ ఆసాంతం ‘మేం ఇద్దరం, మాకు ఇద్దరు’ అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లుగా ఉందని ఆయన విమర్శించారు. దేశంలోని మధ్య తరగతి ప్రజానీకానికి ఈ బడ్జెట్తో ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు.
కేవలం వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర బడ్జెట్ రూపొందించినట్లుగా కనిపిస్తున్నదని, మధ్య తరగతి ప్రజల కోసం ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో ప్రస్తావించింది ఏమీ లేదన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కోసం ప్రభుత్వం గరిష్ఠ స్లాబ్ను తగ్గించిందని, ఇది ఎవరికి మేలు చేయడానికని ఆయన ప్రశ్నించారు. హయ్యస్ట్ ట్యాక్స్ స్లాబ్ను ఎవరి కోసం తగ్గించారో ప్రజలు బాగా అర్థం చేసుకోగలరని సిన్హా పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వేతన జీవుల ట్యాక్స్ రిబేట్ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. రూ.3 లక్షల ఆదాయం వరకు పూర్తిగా పన్ను మినహాయించనున్నట్లు తెలిపారు. గతంలో ఈ పన్ను మినహాయింపు పరిమితి రూ.2.50 లక్షలుగా ఉండేది. గరిష్ఠంగా రూ.15 లక్షలు, ఆపైన వార్షిక ఆదాయం ఉన్నవారిని 30 శాతం పన్ను పరిధిలోకి తెచ్చారు.