న్యూఢిల్లీ: బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పౌల్ 2005లో హత్యకు గురయ్యాడు. ఆ కేసులో శుక్రవారం ప్రత్యేక సీబీఐ కోర్టు తీరును వెలువరించింది. ఆ కేసులో ఏడుమందిని దోషులుగా ప్రకటించింది. అయితే ఆరుగురికి జీవిత ఖైదు శిక్ష(Life Imprisonment)ను విధించారు. గత ఏడాది మర్డర్కు గురైన గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడు. ప్రత్యేక సీబీఐ జడ్జి కవితా మిశ్రా తీర్పును ఇచ్చారు. రంజీత్ పాల్, అబిద్, ఫర్హన్ అహ్మద్, ఇస్రార్ అహ్మద్, జావెద్, గుల్హసన్, అబ్దుల్ కావి ఈ కేసులో నిందితులు. ఇస్రార్ అహ్మద్కు జీవిత కాల శిక్షను విధించలేదు. ఆరుగురికి జీవిత కాల శిక్షతో పాటు 11.65 లక్షల జరిమానా కూడా విధించారు. ప్రయాగ్రాజ్ ఎమ్మెల్యే రాజూ పాల్తో పాటు అతని అనుచరులు దేవి దిన్ పాల్, సందీప్ యాదవ్లను 2005, జనవరి 25వ తేదీన హత్య చేశారు. 2004 ఉప ఎన్నికల్లో అతిక్ అహ్మద్ సోదరుడు అష్రఫ్ను ప్రయాగ్రాజ్ వెస్ట్ సీటులో రాజ్ పౌల్ ఓడించారు. ఆ కక్షతో బీఎస్పీ ఎమ్మెల్యేపై అప్పట్లో అటాక్ జరిగింది. అష్రఫ్ అహ్మద్కు చెందిన 9 మంది గ్యాంగ్.. పాల్ వాహనాన్ని అడ్డుకుని తుపాకులతో కాల్చి చంపారు.