Mayawati : తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్కు పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగించే అంశంపై బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి స్పందించారు. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించే అనుభవం ఇంకా తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్కు లేదని, అందువల్ల ఇప్పటికిప్పుడు అతడికి పార్టీ బాధ్యతలు అప్పగించడం లేదని మాయావతి స్పష్టం చేశారు.
బీఎస్పీకి జాతీయ కార్యవర్గ సమావేశం తాజాగా జరిగింది. ఈ సందర్భంగా తన మేనల్లుడికి బాధ్యతలు అప్పగించే అంశంపై జరుగుతున్న ప్రచారంపై మాయావతి స్పందించారు. నేతలు, కార్యర్తలకు స్పష్టతనిచ్చారు. ‘‘ప్రస్తుతానికి ఆకాష్ ఆనంద్కు పార్టీ కీలక బాధ్యతలు నిర్వర్తించేంత రాజకీయ అనుభవం లేదు. అతడు మరింత రాజకీయ అనుభవం సంపాదించి, విశ్వాసం పొందాలి. అప్పటివరకు ప్రధాన బాధ్యతలు అప్పగించలేను. అయినప్పటికీ, అతడు పార్టీ కోసం స్వేచ్ఛగా పనిచేయవచ్చు’’ అని మాయావతి పేర్కొన్నారు.
నిజానికి కొంతకాలంగా ఆకాష్ ఆనంద్కు పార్టీలో అంత ప్రాధాన్యం లేదు. ఆయన స్థానంపై కూడా సందేహాలున్నాయి. దీంతో తన మేనల్లుడు పార్టీలో కొనసాగవచ్చని ఆమె స్పష్టం చేశారు. అలాగే, కొంతకాలం తర్వాతే ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు దక్కనున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల అంశంపై కూడా మాయావతి మాట్లాడారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మాయావతి వెల్లడించారు. ఏ కూటమిలోనూ ఉండబోదని వివరించారు. అణగారిన వర్గాలకు అధికారం దక్కాలన్నదే తమ ప్రయత్నం అని మాయవతి లక్ష్యమన్నారు. పంజాబ్లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని గతంలోనే మాయావతి ప్రకటించారు.