న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి. జమ్మూకశ్మీర్లోని ఆర్ఎస్ పురా సెక్టార్లో మంగళవారం రాత్రి బీఎస్ఎఫ్ జవాన్లు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. అంతర్జాతీయ సరిహద్దులో జరిగిన ఈ వేడుకల్లో స్థానికులు కూడా పాల్గొన్నారు. దేశభక్తి గీతాలకు బీఎస్ఎఫ్ జవాన్లు, పౌరులు కలిసి స్టెప్పులేశారు.