న్యూఢిల్లీ : పాత ఆచారాలు, సంప్రదాయాలను పునరుద్దరించాలంటే సమాజంలో ఎంతో మంది చొరవ చూపాల్సి ఉంటుంది. ఒడిషాలోని గంజాం జిల్లాలో ఓ వివాహం ఇందుకు వేదికైంది. ఈరోజుల్లో పాత ఆచారాలను అనుసరించేవారు అరుదుగా కనిపించే క్రమంలో సరితా బెహరా, మహేంద్ర నాయక్ల వివాహం అలనాటి ఆచారాలకు వేదిక కావడంతో ఈ జంటపై నెటిజన్లు ((Viral News) ప్రశంసలు గుప్పిస్తున్నారు. అత్తారింటికి ఫ్యాన్సీ కారులో వచ్చేందుకు బదులు సరితా బెహరా అందంగా ముస్తాబు చేసిన ఎడ్ల బండిపై రావడం అందరినీ ఆకట్టుకుంది.
అంతకుముందు వధువు ఇంటికి మహేంద్ర గుర్రం ఎక్కి ఊరేగింపుగా వెళ్లాడు. తామిద్దరం వివాహ బంధంతో ఒక్కటయ్యే రోజున తమ కోసం ఎలాంటి వాహనాలను సిద్ధం చేయవద్దని వధూవరులు ముందుగానే పెద్దలకు చెప్పడం గమనార్హం. మహేంద్ర కోసం గుర్రాన్ని సులభంగానే సిద్ధం చేసినా, సరిత కోసం ఎడ్ల బండిని తీసుకువరావడం సవాల్గా మారింది.
ఎలాగోలా సమీప గ్రామం నుంచి అద్దె చెల్లించి ఎడ్ల బండిని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆపై మహేంద్ర అతడి స్నేహితులు ఎడ్ల బండిని అందంగా అలంకరించారు. ఇక 2022లో మధ్యప్రదేశ్లోని బెతుల్లో పెండ్లి కొడుకు వివాహ వేదిక వద్దకు బుల్డోజర్పై వచ్చి అందరినీ షాక్కు గురిచేశాడు. వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్ అయిన పెండ్లికొడుకు తన రోజువారీ విధుల్లో భాగంగా బుల్డోజర్లు సహా నిర్మాణ రంగ యంత్రాలతో నిత్యం పనిచేస్తుంటాడు.
Read More :