చెన్నై, మే 10: అత్తారింట్లో టాయిలెట్ లేదని మనస్తాపం చెందిన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని కడలూరులో చోటు చేసుకుంది. కడలూరు జిల్లా అరిసిపెరియాకుప్పం గ్రామానికి చెందిన రమ్యను కార్తికేయన్ అనే వ్యక్తితో ఏప్రిల్ 6న పెండ్లి అయింది. అత్తవారింట్లో టాయిలెట్ లేదని పెండ్లి అయినప్పటి నుంచి తల్లి ఇంట్లోనే ఉంటున్నది.
టాయిలెట్ ఉన్న ఇల్లు తీసుకోవాలని లేదా టాయిలెట్ కట్టించాలని భర్తను అడుగుతుండేది. ఈ విషయంలో ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మనస్తాపం చెందిన రమ్య.. సోమవారం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుంది.